రవితేజ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది హీరోయిన్ గాయత్రి భరద్వాజ్. మోడల్గా కెరీర్ను స్టార్ట్ చేసిన ఈమె హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. ఇక రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది గాయత్రీ. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్ టైటిల్ విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తర్వాత దిన్దోర్ తో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లలో మెప్పించింది. తన నటనతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది.
అది కూడా మాస్ మహారాజ్ సరసన పాన్ ఇండియా లెవెల్ మూవీ లో నటిస్తుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇంకా సినిమా రిలీజ్ అయిన కాకముందే టాలీవుడ్ హీరో రామ్చరణ్ అంటే తనకి ఎంతో ఇష్టమంటూ మనసులోని మాట బయట పెట్టింది. రామ్ చరణ్ సినిమాలు ఏవి వచ్చినా మిస్ కాకుండా చూస్తానంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చూసి ఎంజాయ్ చేశానని చరణ్తో నటించే అవకాశం వస్తే బాగుండు అని చెప్పుకొచ్చింది. ఇన్స్టాలో గాయత్రి భరద్వాజ్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లను మించి అందంతో ఆకట్టుకుంటుంది.

అలా ఈమె ఫోటోషూట్స్ మేకర్స్ కంట కూడా పడడంతో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలు నటిస్తున్న ఈమె ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె ఈ ఇవెంట్లో మాట్లాడుతూ తెలుగులో తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అంటూ.. చరణ్ నా క్రష్.. అతను అంటే నాకు చాలా ఇష్టం.. చరణ్కి నేను ఓ క్రేజీ ఫ్యాన్ ని అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్.. అది మా చెర్రీ క్రేజ్. ఆ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంలో తప్పలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.