మనం రోజు తినే ఆహార పదార్థాల్లో పెరుగు ఒకటి, పెరుగులో విటమిన్ బి12, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలుసు. అయితే ఉదయాన్నే పెరుగు అన్నం తినకూడదని మీకు తెలుసా.. ఆయుర్వేదంలో కూడా కాళీ కడుపుతో పెరుగు తినటం నిషేధించబడిందట. ఎందుకంటే ఇది మన శరీరంలో స్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పరగడుపుతోనే పెరుగు తినడం మంచిది కాదట. సిట్రస్ ఫలాలు.. అల్పాహారంలో పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
పండ్లల్లో విటమిన్లు, ఖనిజాలతో సహా చాలా పోషకాలు ఉంటాయి. కానీ సిట్రస్ పండ్లను అల్పాహారంగా తినకూడదు. సిట్రస్ పండ్లు అంటే పులుపుగా ఉండే బత్తాయి, నారింజ, నిమ్మలాంటి వాటిని అల్పాహారంగా తీసుకోకూడదు. దీనివల్ల గుండెలో మంట, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ అల్పాహారంలో ముఖ్యమైన భాగం. బ్రెడ్ తేలికపాటి ఆహారానికి మంచి ఎంపిక. అయితే అల్పాహారంలో వైట్ బ్రేడ్ను చేర్చుకోరాదు. బ్రెడ్ ను పరగడుపున తినడం వల్ల తగిన మోతాదులో పోషకాలు అందవు బ్రెడ్ మైదా పిండితో తయారు చేయబడుతుంది పరగడుపున మైదా ఆహారం అంతా మంచిది కాదు.
పరగడుపున ఏమి తినకుండా స్వీట్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ రిస్క్ కూడా ఉంటుంది. అందువల్ల మీ అల్పాహారంలో చక్కెర పానీయాలని అస్సలు చేర్చకండి. ప్యాటీ ఫుడ్ ఓవైపు ఇంటి పని, మరోవైపు ఉద్యోగం చేసే మహిళలు మాత్రమే కాదు ఇంటికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసే వారికి కూడా ఉదయం అల్పాహారంగా టిఫిన్ రెడీ చేసుకునే టైం ఉండదు. దీంతో క్యాన్డ్ ఫుడ్ ను ఎంచుకుంటున్నారు. అయితే ఈ ఆహారంలో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది కనుక అల్పాహారంగా ప్యాకెడ్ ఫుడ్ను తీసుకోరాదు.