బాలయ్య చెల్లిని మోసం చేసిన ఓ స్టార్ హీరో.. అతను ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ ” సుస్వాగతం ” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దేవయాని. ” చెన్నకేశవరెడ్డి ” సినిమాలో బాలయ్యకు చెల్లిగా నటించింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు ఆమె వందకు పైగా సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో దేవయాని గురించి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఓ హీరోతో ప్రేమలో పడి మోసపోయిందంటూ.. అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే చాలా మంది దేవయాని ప్రేమించింది శంకర్ కుమార్‌ని చెప్పుకోగా.. మరికొందరు మాత్రం అజిత్ అని అనుకునేవారు. ఎందుకంటే ఈ ఇద్దరి స్టార్ హీరోలతోనే దేవయాని ఎక్కువ సినిమాలు చేసింది. ఈ క్రమంలోని వీరి ఇద్దరిలో ఎవరో తెలియదు కానీ.. ప్రేమించిన హీరో ఆమెను మోసం చేశాడని సమాచారం. ఇక రూమర్స్‌కు స్పందించని దేవయాని.. కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వారికి ఇద్దరు పిల్లలు కాగా.. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇప్పటికీ పుట్టింటికి దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటి.. జనతా గ్యారేజ్, అరవింద సమేత లాంటి సినిమాల్లో నటించి అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.