కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా ఇటీవల బలవన్ మరణానికి పాల్పడిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే చాలామంది సాధారణ సందర్భాల్లోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరు. అలాంటిది కుమార్తెను కోల్పోయిన పది రోజుల్లోనే తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాడు విజయ్ ఆంటోని. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైనట్లు తెలుస్తుంది.
విజయ్ హీరోగా దర్శకుడు సీయస్ అముధాన రూపొందించిన సినిమా రత్తం. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం చెన్నైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రెండో కుమార్తెతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫాన్స్ నిబద్ధత కలిగిన నటుడు విజయ్ అంటూ.. తన పెద్ద కుమార్తె లేని బాధ నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక 16ఏళ్ళకే బలవందనానికి పాల్పడిన మీరా గురించి విజయ్ ఆంటోని ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్విట్ చేశాడు.
ఇకపై విజయ్ చేసే ప్రతి సేవా కార్యక్రమానికి మీరా పేరుతో ప్రారంభిస్తారని.. నా పెద్ద కుమార్తె ఎంతో దయగల అమాయ్యి. అంతకుమించి ధైర్యవంతురాలు. కుల, మత, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ఓ ప్రశాంతమైన ప్రదేశంలోనికి ఆమె వెళ్ళింది. ఆమె ఎప్పటికీ నాతోనే ఉంటుంది. మాట్లాడుతోంది. తనతో పాటే నేను చనిపోయాను అంటూ పోస్ట్ చేశాడు. ఇక రత్తం సినిమా విషయానికి వస్తే మీడియా, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బాండింగ్ ప్రజలను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే అంశాన్ని ఈ మూవీ లో చూపించారు. ఇందులో పరిశోధన అధికారిగా భిన్న కోణాలు ఉన్న వ్యక్తిగా విజయ్ ఆంటోని కనిపించబోతున్నాడు. జర్నలిస్టుగా హీరోయిన్ నందిత శ్వేత నటించింది.