అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ లవ్ స్టోరీ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తర్కెక్కిస్తున్న తాజా మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోలో, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల గీతాంజలి పాత్రలో రష్మిక మందన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గురువారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
పవర్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచాడు డైరెక్టర్. యానిమల్ మూవీ తండ్రి, కొడుకుల మధ్యన గొడవని ప్రధాన అంశంగా టీజర్ లో చూపించారు. ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. నేను చెడును వెంటాడుతు వెళ్లాను.. నాకు ఎక్కడా కనపడలేదు.. నాలో నేను చూసుకున్నాను నా కన్నా చెడ్డవాడు లేడు అంటూ రణ్బీర్ కపూర్ చెప్పిన డైలాగ్ కథలో భావోద్వేగాలకు కేరాఫ్ అడ్రస్ అనిపిస్తుంది.
సాధారణ యువకుడు రెబెల్ గా మారితే ఎలా ఉంటాడు అనేది ఈ టీజర్ లో చూపించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనదైన మార్క్ లో టీజర్ ను ప్రెసెంట్ చేశాడు. ఈ సినిమా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కపూర్, ప్రణయ్ రెడ్డి వంగా ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రిలీజై ప్రేక్షకులలో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.