ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా చెల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్.. తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూని పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు.
చిల్లపల్లి కి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అక్కడే ఫిజియోథెరపీస్ట్.. యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వారి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారక తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సాంప్రదాయంలో వైభోగంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియా కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు.. పురుషులు పెట్టు పంచలు ధరించి ఆకట్టుకున్నారు.