తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్…. నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు….!

ఈ శాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ఇవాళ బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజులుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల కు వాతావరణ శాఖ అలర్ట్ లు జారీ చేసింది. 9 జిల్లాలకు అరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహా బూబ్ నగర్, నాగ‌ర్‌క‌ర్నూల్‌ జిల్లాల్లో అతిబరి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారి చేసింది. ఆసిఫాబాద్ , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.

ఇకపోతే ఏపీలోని కోస్తాంధ్రలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు గురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు కోస్తాంధ్ర, యానాంకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 11.5 సెం.మీ నుంచి 20.44 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో బలంగా గాలులు వీస్తుయని.. భారీ వానలు ఉంటాయని అప్రమత్తంగా ఉండాల‌ని చెబుతుంది వాతావరణ శాఖ. సముద్రంలో వేటకు వెళ్లే వారిని హెచ్చరిస్తుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ.