వాళ్లకి కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వబోతున్న విజయ్ దేవరకొండ..!

ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఖుషి. మైత్రి మూవీ మేకర్స్‌ పై సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. స‌మంత‌కి యశోద లాంటి ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండకి లైగ‌ర్‌ డిజాస్టర్ తర్వాత ఇద్దరు కలిసి ఒక్కసారిగా ఖుషి సినిమాతో మంచి హిట్ అందుకోవడం విశేషం. కులాంతర వివాహం చేసుకున్న హీరో, హీరోయిన్లు బయటకు వచ్చి తమ ప్రేమను పెద్దవారికి ఎలా నిరూపించారు అనే అంశం ఈ సినిమాలో చూపించారు.

ఇద్దరు వ్యక్తులు జాతకాలు కలపడం కాదు వారిద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు అనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించాడు శివ నిర్వాణ‌. ఈ సినిమా 3 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో నిన్న ఈ సినిమాకు సక్సెస్ మీట్ ను వైజాగ్ లో గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో విజ‌య్‌ మాట్లాడుతూ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఏ హీరో ఇవ్వని పెద్ద గిఫ్ట్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చాడు.

ఖుషి కి వచ్చిన రమ్యరేషన్ లో ఒక కోటి రూపాయలు అభిమానుల కోసం ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. నా సంపాదన నుండి కుటుంబానికి రూ. లక్ష చొప్పున 100 కుటుంబాలకు.. కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానని త్వరలోనే ఆ ఫ్యామిలీస్‌ని మీకు పరిచయం చేస్తానంటు చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ కుటుంబాలు ఎవో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాలి.