జుట్టుకి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ప్రస్తుత కాలంలో పొల్యూషన్ కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుండ్రు సమస్య ఉండడం ద్వారా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా, చుండ్రు లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక ఆయుర్వేద రెమిడి తెలుసుకుందాం.
ఈ టిప్ ఫాలో అయితే జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ అవుతుంది. జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ రెమిడీ కోసం గంజిని ఉపయోగిస్తున్నాం. గంజి లో ఉన్న పోషకాలు జుట్టును మృదువుగా చేయడమే కాకుండా చుండ్రును, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత కలోంజీ విత్తనాలు తీసుకోవాలి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. ఇక తర్వాత మెంతులు తీసుకోవాలి. మెంతులు చుండ్రుని తగ్గించి జుట్టుని రాలకుండా చేస్తుంది.
ఒక గిన్నెలో గంజి తీసుకుని రెండు స్పూన్ల కలోంజీ విత్తనాలు, రెండు స్పూన్ల మెంతులు వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ గింజలను చేతితో బాగా కలపాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలు గంజిలోకి వస్తాయి. ఇప్పుడు వీటిని వడకట్టాలి. గింజలను జుట్టు కుదుళ్ళు నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు గాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలు దరి చేరవు. ఈ చిట్కా చాలా వేగంగా పనిచేస్తుంది.