తెలుగు సినిమా నుంచి ఇప్పటివరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ నేషనల్ అవార్డుని అందుకున్నారు తెలుసా? 1967 నుంచి ఇప్పటివరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు ని అందుకుని తెలుగు సినిమా రంగంలో ఒక చరిత్ర సృష్టించాడు.
తాజాగా నిన్న 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ గాను నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. కీరవాణితో పాటు మరో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అలాగే పుష్ప మూవీ మ్యూజిక్ తో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాతోనే మొదట నేషనల్ అవార్డు అందుకున్నాడు.
కానీ కీరవాణి మాత్రం ఇంతకుముందే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా జాతీయ పురస్కారం అందుకున్నాడు. 1997లో నాగార్జున హీరోగా తెరకెక్కిన భక్తిరసా చిత్రం అన్నమయ్య సినిమాకి కీరవాణి అవార్డుని అందుకున్నాడు. మళ్లీ 26 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు. అలాగే వీరే కాకుండా టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు నేషనల్ అవార్డులను. ఏఏ సినిమాకు గాను ఎవరెవరు అవార్డులు అందుకున్నారో ఇప్పుడు చూద్దాం.
1979 – కె.వి.మహదేవన్ (మూవీ – శంకరాభరణం)
1982 – రమేష్ నాయుడు (మూవీ – మేఘసందేశం)
1983 – ఇళయరాజా (మూవీ – సాగర సంగమం)
1988 – ఇళయరాజా (మూవీ – రుద్రవీణ)
1997 – ఎం ఎం కీరవాణి (మూవీ – అన్నమయ్య)
2004 – విద్యాసాగర్ (మూవీ – స్వరాభిషేకం)
2013 – శంతను మొయిత్రా (మూవీ – నా బంగారు తల్లి)
2020 – థమన్ (మూవీ – అల వైకుంఠపురములో)
2021 – ఎం ఎం కీరవాణి (మూవీ – RRR)
2021 – దేవిశ్రీప్రసాద్ (మూవీ – పుష్ప)