రష్మిక మందన్నా..సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిఫోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అమ్మడు యాక్టింగ్ ఒక్క కారణం అయితే..నటించిన ప్రతి సినిమాలోను తనకంటూ ఓ ఢిఫరెంట్ స్టైల్ ను మెయిన్ టైన్ చేస్తుంది. అంతేనా సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. దీంతో రష్మిక తో సినిమా చేయదానికి స్టార్ డైరెక్టర్లు కూడా ఇంట్రెస్ట్ చూయిస్తూ..రష్మిక కి మంచి మంచి ఆఫర్లు ఇచ్చారు. వాటిని కరెక్ట్ గా వాడుకున్న అమ్మడు ఇప్పుడు టాప్ 5 హీరోయిన్లల్లో ఒకరుగా నిలిచింది. రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటుందండోయ్.
ఈ మధ్యనే అల్లు అర్జున్ తో కలిసి పుష్ప అనే మూవీ లో శ్రీవల్లి పాత్రలో ఫస్ట్ టైం డీ గ్లమరస్ లుక్ లో నటించి మెప్పించింది. ముఖ్యంగా సామీ సామీ అనే పాటలో ఇరగదీసింది. ఆ నడుము తిప్పుతూ అబ్బో అది చెప్పలేం చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక ఇప్పుడు ఫ్యామిలీ హీరో శర్వానంద్ తో కలిసి “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమాలో నటిస్తుంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘నేడు అనగా మార్చి 4న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రజలను ఆకట్టుకుంటుందని ముందే డైరెక్టర్ చాలా సంధర్భాలల్లో చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ..సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ..” నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా అబ్బాయిలానే పుట్టాలని కోరుకుంటాను. ఎందుకంటే..ఈ సినిమా పుణ్యమా అని పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి…ఒక అమ్మాయి అప్పుడు ఎలా ఫీల్ అవుతుందనేది నాకు బాగా అర్ధమైంది. ఇష్టం ఉన్నా లేకపోయినా చక్కగా అలంకరించుకుని.. అబ్బాయి, వాళ్ల బంధువులు ముందు తల వంచుకుని బొమ్మల కూర్చోవాలి. ఇక అబ్బాయి ఏమో చక్కగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు” అందుకే నెక్స్ట్ జన్మలో మగవాడిగా పుట్టాలని అనుకుంటున్నా ” అంటూ క్లారిటీ ఇచ్చింది రష్మిక.