ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ కు ఎలాంటి పాపులారిటీ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్.. చేసిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. మంచి ఇమేజ్ను దక్కించుకున్నాడు. ప్రభాస్తో చేసిన సలార్ సినిమాతో ఏకంగా రూ.700 కోట్లకు పైగా.. కలెక్షన్లు రాబట్టి.. ఇండియన్ వైడ్గా తిరుగులేని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా.. తనకు ఒక స్పెషల్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆడియన్స్ లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక మరో పక్క సందీప్ రెడ్డి వంగ సైతం తీసింది మూడు సినిమాలు అయినా.. మూడు సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసి ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు.
గొప్ప ఇమేజ్ను దక్కించుకున్నాడు. ప్రతి సినిమాలో వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ను పలకరించి.. సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా.. ప్రభాస్ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. మరోపక్క ప్రశాంత్ నీల్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో.. మాస్ కమర్షియల్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూట్ ప్రారంభమై శరవేగంగా స్కెడ్యూలను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ డైరెక్టర్స్లో నెవ వన్ ఎవరో నిర్ణయించడం ఆడియోస్ కు కూడా కష్టతరమవుతుందట.
ఇప్పుడు వరకు ఇద్దరు మూడు.. మూడు సినిమాలతో మంచి సక్సెస్ లో అందుకున్నారు. కాగా రాబోయే సినిమాలతో వీళ్ళు అందుకునే సక్సెస్ బట్టి.. వీళ్లిద్దరిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు తేలిపోతుంది. ఇద్దరిదీ వేరువేరు మేకింగ్ స్టైల్, ప్రశాంత్ మాస్ కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకుంటే.. సందీప్ రెడ్డి వంగ వైవిధ్యమైన జానర్లో సినిమాలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి అభిమానుల మధ్యన స్ట్రాంగ్ వార్ మొదలైంది. ఇక ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలు నటించేందుకు పాన్ ఇండియా లెవెల్ స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారంటే.. వీళ కెపాసిటి ఏంటో తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ తెలియాలంటే.. వీళ్ళిద్దరి ఫ్యూచర్ ప్రాజెక్ట్ రిజల్ట్స్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.