టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. గ్లోబల్ లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన దేవర సినిమాతో మరోసారి హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దేవర సినిమా రిలీజై అప్పుడే.. 9 నెలలు కావస్తున్న తారక్ నుంచి ఇప్పటివరకు మరో కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుందా అంటూ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ 14న ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ వార్ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో హృతిక్ రోషన్ కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సోలో హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తాజాగా మరో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు టైటిల్ అఫీషియల్ గా ప్రకటించకున్న.. డ్రాగన్ వర్కింగ్ టైటిల్తో సినిమా రూపొందుతుంది. ఇక సైలెంట్ గా.. స్కెడ్యూల్స్ను పూర్తి చేసేస్తున్న ఈ సినిమాకు.. ఇప్పటికే ఆల్మోస్ట్ కీలక సన్నివేశాల షూట్ అంతా పూర్తి చేసుకుందని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్గా మారుతుంది. ఈ నెల 3వ వారం నుంచి సినిమాకు సంబంధించిన సరికొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని.. దీనికోసం బెంగళూరులో ఇప్పటికే భారీ సెట్స్ను నిర్మించినట్లు తెలుస్తోంది.
సెట్లో ఎన్టీఆర్ పై పలు కీలక యాక్షన్స్ సన్నివేశాలు రూపొందించనున్నారట. ఇక ఈ సీక్వెన్స్లో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొననున్నాడని టాక్. ఇక సినిమా మొత్తానికి ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న ఎవర్ గ్రీన్ స్పెషల్ మూవీగా డ్రాగన్ నిలిచిపోతుంది అంటూ.. ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీళ్ కూడా ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడట. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకొని మరి కష్టపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్న క్రమంలో.. సినిమా పూర్తై రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. తారక్ మార్కెట్ మరింతగా పెరుగుతుందా.. లేదా.. వేచి చూడాలి.