మరోసారి టాలీవుడ్ డైరెక్టర్‌తో ధ‌నుష్‌.. ఈ సారి మాస్ డైరెక్ట‌ర్‌తో…!

కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలతో ఇక్కడ హీరోలకు సైతం ధనుష్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో తెలుగులో ఆయన నటించిన ప్రతి సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా కుబేరతో అదరగొట్టాడు ధనుష్. ఈ సినిమాలో దేవ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. బిచ్చగాడిగా న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సైతం.. కచ్చితంగా ధనుష్‌కు నేషనల్ అవార్డు రావాలని.. అంతలా ఒదిగిపోయినటించాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

అంతలా.. కుబేర సినిమాలో తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు ధనుష్. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని కింగ్ నాగార్జున కీలక పాత్రలో.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా క‌లెక్ష‌న్‌ల‌ పరంగా సంచలనం సృష్టిస్తుంది. ధనుష్‌పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో.. ధనుష్ నెక్స్ట్ ఏ దర్శకుడితో పని చేయబోతున్నాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల ప్రకారం.. ధనుష్ తన నెక్స్ట్ సినిమాను కూడా మరోసారి టాలీవుడ్ డైరెక్టర్‌తోనే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Balakrishna's conditions to Boyapati Srinu - Telugu360

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. బోయపాటి శ్రీను. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక మార్గం క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి. ఈ క్రమంలోనే ధనుష్.. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో ఓ సినిమా కమిట్ అయినట్లు టాక్‌ తెగ ట్రెండింగ్‌గా మారింది. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్క‌నుందట. గతంలో భద్రా సినిమా లెవెల్‌లో ధనుష్ కోసం బోయపాటి ఒక్క స్ట్రాంగ్ ఫ్రాక్షన్ కథను రాసుకున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. బోయపాటి, ధనుష్‌కు ఆల్రెడీ కథ‌ని వినిపించాడట. ఆల్మోస్ట్ సినిమా ఫైనలైజ్ అయిందని సమాచారం. అన్నీ ఓకే అయితే.. అఖండ 2 షూట్ కంప్లీట్ అయిన వెంటనే ధనుష్‌తో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజ‌న్స్‌.