టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాల్లో తారక్తో పాటు.. హృతిక్ రోషన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. అయాన్ ముఖర్జీ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకున్నా.. సినిమాపై ఆడియన్స్లో మాత్రం అంచనాలు మొదలయ్యాయి. కాగా.. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. సాంగ్స్ మాత్రం రెండంటే రెండే ఉంటాయని టాక్ నడుస్తుంది.
కాగా.. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్.. ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి రాబోయే గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తాయని సమాచారం. ఇక సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ ఉండునున్నాయని.. సినిమా మొత్తానికి ఓ పడవ సీక్వెన్స్ హైలెట్ అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఎన్టీఆర్ నటించిన మరో ప్రాజెక్ట్ డ్రాగన్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు మరింత సమయం ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయడం లేదట. వార్ 2 సినిమాలో హృతిక్తో కియారాకు ఓ సాంగ్ ఉంటుందని.. ఆ సాంగ్ లో కియారా బికినీలో కనిపించనిందని టాక్.
ఇక ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఓ సాంగ్ ఉండబోతుందని.. ఈ సాంగ్ షూట్ మాత్రం వచ్చే నెలలో జరుగుతుందని.. జూన్ నెలాఖరుకు ఈ షూట్ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సునామి ఖాయం అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా అటు టాలీవుడ్లోను.. ఇటు బాలీవుడ్లోను హిట్గా నిలవనుందంటూ టాక్ నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ వార్ 2కి పోటీగా రజనీకాంత్ కూలి సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ రెండిటి మధ్యన కాంపిటీషన్లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానున్న.. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు ఏ రేంజ్ లో లాభాలు తెచ్చి పెడతాయో తెలియదు కానీ.. ఎన్టీఆర్కు మాత్రం కెరీర్లోనే మెంబరబుల్ మూవీగా వార్ 2 నిలిచిపోతుందట.