టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. స్పీడ్ రైటింగ్ స్టైల్ అన్నా.. చకచక సినిమాలు తీసే విధానం అన్న సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడంటే పూరి జగన్నాథ్ సినిమాల విషయంలో వెనుక పడ్డాడు కానీ.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్లకు స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చి.. వారిని స్టార్లుగా నిలబెట్టిన ఘనత మాత్రం పూరి జగన్నాథ్కే దక్కుతుంది. కాగా.. పూరి జగన్నాథ్ రైటింగ్ స్టైల్, సినిమా మేకింగ్ ను ఇష్టపడే సెలబ్రిటీస్లో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు వెల్లడించారు.
తన ఫోన్ వాల్ పేపర్ పై కూడా పూరి జగన్నాథ్ ఫోటో నే పెట్టుకుంటానని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంత పెద్ద స్టార్ దర్శకుడు.. రాజమౌళి తండ్రి హోదాలో ఉన్నప్పటికీ.. విజేంద్రప్రసాద్, పూరితో ఒక్కసారైనా పని చేయాలని కోరిక అంటూ ఎన్నోసార్లు మనసులో మాట రివీల్ చేశారు. ఎట్టకేలకు ఆ కోరిక తీర టైం దగ్గర పడిందంటూ టాక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేసే అవకాశం విజయేంద్ర ప్రసాద్కు వచ్చిందట. తాజాగా విజయేంద్ర ప్రసాద్.. పూరి జగన్నాథ్, ఛార్మితో కలిసి ఉన్న ఫోటోను.. పూరి ఛార్మి టీం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
ఇక పూరి జగన్నాథ్ను కలిసిన విజయేంద్రప్రసాద్.. సినిమాల విషయంలో సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇకపై ఏ కథ రాసినా.. దానిని తనకోసారి పంపించమని విజయప్రసాద్ రిక్వెస్ట్ చేశాడట. దానికి కారణం ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన పూరి. ఇప్పుడు అంతే వేగంగా స్టోరీస్ పూర్తి చేసే సరవేగంగా సినిమా తీసి ఫ్లాప్లు తెచ్చుకుంటున్నాడని బాధనే అట. మళ్లీ పాత పూరిని చూడాలని ఎలాగైనా.. పూరి జగన్నాథ్ కి పూర్వ వైభవం రావాలని విజయేంద్రప్రసాద్ ఆరాటపడుతున్నాడట. ఈ క్రమంలోనే ఆయన పూరి జగన్నాథ్ స్టోరీలు తనకు పంపమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. పూరి గత పది సినిమాలుగా వరుస పెటి డిజాస్టర్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ మినహా అన్ని సినిమాలు బిగ్గెస్ట్ ప్లాపులుగా నిలిచాయి. ఇలాంటి క్రమంలో విజయేంద్రప్రసాద్.. పూరీకి తోడయ్యాడు. కనుక తన కొత్త సినిమా స్క్రిప్ట్ ను టాలీవుడ్ లోనే బడా పాపులర్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ కు పూరీ వినిపిస్తాడా.. లేదా.. అనేది అందరిలోనూ పెద్ద సందేహంగా మారింది. అంతే కాదు విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు కథలు ఇస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి బిజి స్కేడ్యూల్లో విజయేంద్ర ప్రసాద్ పూరీకి హెల్ప్ చేస్తానంటే రాజమౌళి ఒప్పుకుంటాడా.. లేదా. అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.