పవన్‌ను టార్గెట్ చేసిన ఆ నలుగురు.. రంగంలోకి ఏపీ గవర్నమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్‌లో జూన్ 1నుంచి థియేటర్‌ల‌ మూసివేతకు.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. దీని వెనుక పెద్ద కుట్ర కొణం ఉందని.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో కావాలని ఆ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ఓ నలుగురు కంకణం కట్టుకొని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారంటూ సమాచారం. అందులో భాగంగానే.. థియేటర్‌లు మూసి వేయించాలనే ప్లాన్ కూడా వాళ్లే వేసి ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారట. తాజాగా.. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రియాక్ట్ అయ్యారు.

అవును కావాలని నలుగురు ప్రొడ్యూసర్లు టార్గెట్ చేశారని.. సినిమా రిలీజ్ కాకుండా ఈ థియేటర్ల బంద్‌ను మొదలు పెట్టారని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని.. నిజంగానే ఇందులో వాస్తవం ఎంతో తేల్చాలని పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రంగంలోకి దిగాడు. దీనిపై తాజాగా హోమ్ శాఖ కార్యదర్శి కి దిశ నిర్దేశం చేసాడు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్‌తో మాట్లాడుతూ.. ఈ పరిణామాలతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కట్టలా ఏర్పడి.. అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి వెంటనే విచారణ చేపట్టాలని క్లారిటీ ఇచ్చారు.

సినిమా హాల్స్ మూసివేయడం మూలంగా ఎన్నో సినిమాలు ప్రభావం అవుతున్నాయని.. ఎంత టాక్స్ రెవిన్యూ కి కూడా విగాథం కలుగుతుందనే కోణంలో వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది. తెర వెనుక రాజకీయాలు చేస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై వినోదం అందకుండా పవన్‌ను ఇబ్బంది పెట్టాలని ఆ నలుగురు భావిస్తున్నా.. వారు అనుకున్నది సాధ్యమయ్యేలా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరు ఎలాంటి విన్యాసాలు చేసినా క్షణాల్లో ప్రజలు కనిపెట్టగలరు. వీర‌మ‌ల్లును అడ్డుకోవడం వెనుక‌ ఎవరున్నారు అనేది థియేటర్లో.. మూసివేత వెనుక జరుగుతున్న కొట్రా కోణాలు ఏంటి అనేది రేపటి రోజున ప్రజ‌లకు క్లారిటీగా తెలియనుంది.