రస్నా యాడ్ లో మెరిసిన ఈ చిన్నది రాజమౌళి మూవీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ప్రొడెక్ట్‌తో సంభందం అన్ని బ్రాండ్లను తెగ ప్రమోట్ చేసేస్తూన్నారు కానీ.. గతంలో దూరదర్శన్‌లో మాత్రం వేళ‌పై లెక్కించే రేంజ్‌లోనే యాడ్స్ కనిపించేవి. వాటిలో ఎక్కువగా పాపులార్ అయిన‌ యాడ్ ఏదైనా ఉందంటే అదే రస్నా యాడ్. వేస‌వి కాలం వచ్చిందంటే చాలు.. ఈ యాడ్ టీవీలలో మారుమోగిపోయేది. ఇక ఈ ప్రకటనలో ఎంతో ముద్దుగా.. అమాయకంగా కనిపించిన చిన్నారి సైతం అప్పట్లో అదే రేంజ్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ రాస్నా యాడ్ బుడ్డది.. సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు.

సింహాద్రి హీరోయిన్ అంకిత ఏమైపోయింది.. ఆమె భ‌ర్తను ఎప్పుడైనా చూశారా..? - Telugu Lives

ఇంతకీ ఆమె మరెవరో కాదు అంకితా. లాహిరి లాహిరి లాహిరితో సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ‌.. తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో.. సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో.. రికార్డ్‌లు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో తారక్‌ సరసన.. అంకిత, భూమిక ఇద్దరు హీరోయిన్‌లుగా నటించారు.

Ankitha: అందుకే నటనకు దూరం కావాల్సి వచ్చింది: 'సింహాద్రి' హీరోయిన్‌ | simhadri-actress-ankitha-reveals-why-she-was-away-from-industry

ఇందులో గ్లామర్ బ్యూటీగా అంకిత తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలోనే అమ్మడు తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలను ద‌క్కించుకుంది. నిజానికి.. అంకిత చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. లాహిరి లాహిరి లాహిరితో హీరోయిన్గా మారింది. అలా తెలుగులో సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, నవవసంతం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగులోనే కాదు.. తమిళ్లోను పలు సినిమాల్లో నటించి ఆడియ‌న్స్‌ను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో విశాల్‌ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.