టాలీవుడ్ మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా వివాదాన్ని చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కలెక్షన్ మంచు మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు, చిన్న కొడుకు మంచు మనోజ్ల మధ్యన వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కోర్టుమెట్ల వరకు వెళ్ళింది. తండ్రి మోహన్ బాబుకు.. తనకు మధ్య తన అన్న మంచు విష్ణు చిచ్చుపెట్టాడని.. మనోజ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. విష్ణు మా పై దాడికి దిగాడంటూ మనోజ్ ఆరోపించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి కౌన్సిలింగ్ ఇవ్వడంతో గొడవకు సబ్ బ్రేక్ పడిందని అంతా భావించారు. అయితే.. తాజాగా ఈ గొడవలు మళి రేకెత్తిస్తున్నారు మంచు మనోజ్, విష్ణు. ఇటీవల మంచు విష్ణు ఫారన్ ఫాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో తోబుట్టువులే నా పతనం కోరుకుంటున్నారు అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తను హీరోగా నటించిన భైరవ సినిమా ప్రమోషన్స్ లో మంచు మనోజ్ ఈ గొడవలను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తనను కట్టు బట్టలతో నడిరోడ్డుపై నుంచోపెట్టారంటూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనోజ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. భైరవం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నా అనుకున్న వాళ్లు నన్ను దూరం పెట్టారు. కట్టుబట్టలతో రోడ్డుపైకి గెంటేశారు. ప్రేక్షకులే నాకు సపోర్ట్ గా నిలిచారు. కష్ట సమయంలో సైతం నాకు అండగా ఉన్నారు. వాళ్ళందరికీ పాదాభివందనం. నాకు ఎవరి మీద కోపం ఉండదు. చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా కామనే అంటూ మనోజ్ వివరించాడు. కానీ.. కొందరు కావాలని కుట్రపూరితంగా నన్ను మా నాన్నకు దూరం చేసేస్తున్నారని.. ఎవరైనా కుట్రలు చేసినా ఐ డోంట్ కేర్.. నా కట్టే కాలేంత వరకు నేను మోహన్ బాబు కొడుకునే అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
ఏవి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్.. అంతకముందు.. మంచు మనోజ్ సినీ ఎంట్రీకి సంబంధించిన వీడియో వీక్షించాడు. ఆ ఏవిని చూస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. డైరెక్టర్ ఓదార్చిన కన్నీటిని అప్పు లేకపోయినా మనోజ్.. వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ వీడియో నెటింట తెగ వైరల్గా మారుతుంది. ప్రస్తుతం వీడియో చూసిన అభిమానులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిజంగానే చాలా గ్రేట్ అని.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని.. బ్లాక్ బస్టర్ కొట్టాలంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్తో పాటు.. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో కనిపించనన్నారు. అధితి శంకర్, దివ్య, ఆనంది హీరోయిన్లుగా మెరువనున్నారు. విజయ్ కనకమెడల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మే 3న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.