టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తారక్, చరణ్ మల్టీసారర్గా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి సంచలనం సృష్టించిన ఐసవంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అందరితోను ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు తలెత్తి చూసే రేంజ్కు సక్సస్ అందుకుంది. ఆస్కార్ అవార్డున సైతం సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ సినిమా లైవ్ కాన్సెర్ట్ ఘనంగా ఏర్పాటు చేశారు.
దీని కోసం చరణ్, తారక్, రాజమౌళి. కీరవాణి ఒకే వేదికపై హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. చరణ్.. తారక్ రాయల్ అల్బర్టట్ హాల్లోకి స్టైలిష్గా ఎంట్రీ ఇవ్వడం.. ఒకే వేదికపై ఆర్ఆర్ఆర్ త్రయం కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందాలకు హద్దులేకుండా పోయాయి. రాయల్ అల్బర్ట్ హాల్ వేదికపై చెర్రీ.. తారక్కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. త్వరలో మే 20న తారక్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న క్రమంలోనే చరణ్.. అదే వేదికపై తారక్కు అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలియజేశాడు.
వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ మరోసారి ఫ్యాన్స్ లో హైలెట్ గా మారింది. తారక్ కూడా.. చరణ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. చరణ్ భోజనంతో పాటు.. తన డైట్లో వెన్నపూస కూడా కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నాడు. అలా రాయల్ ఆల్బట్ హాల్ మొత్తం చరణ్, తారక్ నినాదాలతో మోత మోగిపోయింది. కాగా రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కాన్సర్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా బాహుబలి 2. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్కు మళ్లీ ఆ ఘనత దక్కింది.