మహేష్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. కలకలం రేపుతున్న ఇన్స్టా పోస్ట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా తెలుగులోనే క్రేజ్‌తో దూసుకుపోతున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. ఆఫ్రికన్ అడవుల్లో నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇలాంటి క్రమంలో మహేష్‌కు సంబంధించిన ప్రతి చిన్న వార్త నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక మహేష్‌కే కాదు.. మహేష్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ టాలీవుడ్ లో రాణించిన సంగతి తెలిసిందే.

Namrata Shirodkar Spoke About Sibling Rivalry And Bond With Shilpa Shirodkar, 'I Am Not Too Sure...'

ఇలాంటి నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్ వచ్చిందంటూ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. ఆరేళ్ల క్రితం దేశాన్ని పట్టి పీడించిన కరోనా మహమ్మారి.. మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో గడిచిన వారంలో ఏషియాలో 14,200 కేసులు నమోదు అవ్వడం గమనార్హం. కాగా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిని అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నారు.

Mahesh Babu Enjoying With Namrata & Her Sister Shilpa Shirodkar | #MaheshBabuFamily

ఇలాంటి నేపథ్యంలో మహేష్ వదిన.. నమ్రత శిరోద్కర్ అక్క అయిన బాలీవుడ్ నటి.. శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ రావడం అందరికీ షాక్ ను కలిగిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది శిల్పా. అందరూ మాస్కులు ధరించండి.. సేఫ్ గా ఉండండి అంటూ ఆమె ఈ పోస్ట్ లో పంచుకుంది. ఈ క్రమంలోనే ఆమె తోటి నటులు, అభిమానులు తను త్వరగా కోలుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనా కేసులు మరోసారి విజృంభించ‌డానికి ప్రధాన కారణం ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడమేనని.. ఆరోగ్య శాఖ వెల్లడించింది.