కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్కు ఎలాంటి క్రేజ్, పాపులారిటి ఉందో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న లోకేష్.. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న లోకేష్.. తర్వాత పలు సీక్వెల్స్ తో పాటు.. క్రేజీ ప్రాజెక్టులతోను సందడి చేయనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి. కూలీ మూవీ మల్టీ స్టారర్గా రానున్న నేపథ్యంలో.. ఆ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, షాహిర్ సహా పలువురు నటించనున్నారు.
ఈ క్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. కూలి సినిమా తీస్తున్న టైం లో సౌబిన్ షాహిర్ 6,7 సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది అంటూ వెల్లడించాడు. ఐదు నెలల గ్యాప్ లో 7 భారీ ప్రాజెక్టులను ఆయన పక్కన పెట్టేసారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చాలా గెటప్ లు ఉన్నాయని.. కనుక ఇతర మూవీలకు దూరంగా ఉండమని నేను చెప్పానంటూ వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలను వదిలేసుకున్నారని.. నా మూవీలోని కాస్టింగ్ అంతా ప్రాజెక్టుగా పూర్తిగా అంకితం అవ్వాలని ఎప్పుడూ నేను కోరుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. నా సినిమాలను 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పుకొచ్చిన లోకేష్.. నేనేం త్రిబుల్ ఆర్ సినిమాను తీయట్లేదు కదా అంటూ కామెంట్లు చేశాడు.
మూడు సంవత్సరాల పాటు ఆర్టీస్టులను హోల్డ్ చేసే స్థాయి సినిమాలు నావి కావు అంటూ.. కామెంట్లు చేశాడు. అలాంటి సినిమాలు నేను చేయనంటూ పేర్కొన్నాడు. గతంలో ఏ మూవీ అయినా ముందు నిర్మాతలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే.. షూటింగ్ మొదలుపెట్టే వారంటూ గుర్తు చేసుకున్న లోకేష్.. ఇప్పుడు కూలి మూవీ విషయంలో అలా జరగలేదంటూ వ్యాఖ్యానించాడు. ప్రశాంతంగా వర్క్ చేస్తున్నామంటూ వివరించాడు. అదే టైంలో రజనీకాంత్తో వర్క్ చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అని ముఖ్యంగా జీవిత సత్యాలు తెలిసాయి అంటూ వెల్లడించాడు. ఆయన తన లైఫ్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవడం ఆనందాన్ని కలిగించిందని.. తలైవా చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయన ముందు నేను ఆఫ్ట్రాల్ అనిపించింది అంటూ వెల్లడించాడు. అలా రజిని పై తన గౌరవాన్ని చాటుకున్న లోకేష్ ఆర్ఆర్ఆర్ సినిమాపై అలాంటి కామెంట్స్ చేయడం రాజమౌళి పై సెటైర్లు వేసినట్లు ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జనం.