ఏపీ డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు.. వచ్చే నెల 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియనస్లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దియేటర్ల బంద్ వివాదం ఎంతలా ప్రకంపనులు సృష్టించిందో తెలిసిందే. జూన్ 1 నుంచి సినిమా ధియేటర్లు బంద్ చేస్తున్నారని.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందు.. ఇలా థియేటర్ల బంద్ను ప్రకటించడంతో.. దాని వెనుక నలుగురు నిర్మాతలు, ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయని వార్త తెరపైకి వచ్చింది. సరిగ్గా ఇదే టయానికి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చు టాలీవుడ్కు ఝలక్ ఇచ్చాడు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పెద్దలు ఎవరు మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబునే కలిసింది లేదంటూ ఇండస్ట్రీని ఉద్దేశించి సంచల లేఖ రాశాడు. టాలీవుడ్కు అన్ని విధాలా అండగా ఉన్న ప్రభుత్వ పెద్దలను కలవకపోవడం.. పై తప్పు పట్టిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీపై మండిపడ్డాడు. దీంతో థియేటర్ల బంధ్ వెనుక ఎవరున్నారని చర్చ మరింత హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా దీని వెనక దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి స్టార్ నిర్మాతల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే ఎలర్ట్ అయిన అల్లు అరవింద్ దీనిలో నా ప్రేమేయం లేదని క్లారిటీ ఇచ్చాడు. థియేటర్ల బందుకు.. నాకు అసలు సంబంధం లేదు అంటూ వెల్లడించాడు. ఇక దిల్ రాజు సైతం తనపై వచ్చిన ఆరోపణలను పుకారులని క్లారిటీ ఇచ్చాడు. పవన్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదంటూ దిల్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
జనసేన నేత.. అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందని చెప్పగానే చెప్పేశారు. ఈ క్రమంలోనే పవన్.. జనసేన పార్టీ నుంచి అతనిని సస్పెండ్ చేశాడు. అలా పవన్ వార్నింగ్ దెబ్బకు టాలీవుడ్ లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లు దాదాపు దీనిపై రియాక్ట్ అయ్యారు. ఇంత జరుగుతున్నా ఈ ఈ ఘటనపై రియాక్ట్ కానీ ఏకైక ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సురేష్ బాబే. సురేష్ బాబు చేతుల్లో కూడా చాలా థియేటర్లో ఉన్నాయి. థియేటర్ల బంధు విషయంలో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయినా.. అల్లు అరవింద్, దిల్ రాజులా సురేష్ బాబు రియాక్ట్ కాలేదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.
దీన్ని బట్టి సురేష్ బాబు ఎంత ధైర్యంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గతంలోలా ఆయన ప్రజెంట్ నిర్మాతగా యాక్టివ్ గా ఉండడం లేదు. డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించడం లేదు. ఈ క్రమంలోనే తనకు సంబంధం లేని విషయం రియాక్ట్ అవ్వాలని సురేష్ బాబు భావించలేదట. అందుకే ఈ వివాదం పై ఆయన నోరు మెదపలేదని తెలుస్తుంది. అయితే గత వైసిపి ప్రభుత్వం ఉన్న టైంలో టికెట్లు వివాదం వచ్చిన నేపథ్యంలో అవసరమైతే సినిమాలు తీయడం మానేస్తా కానీ.. ఎవరిని కలవనని తెల్చి చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన అదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. అందుకే పవన్ లేక తర్వాత కూడా సురేష్ బాబు స్పందించలేదట. మొత్తానికి ఈ వివాదంలో పేర్లు వినిపించినా.. పవన్ వార్నింగ్ తర్వాత కూడా రియాక్ట్ కానీ ఏకైక ప్రొడ్యూసర్ సురేష్ బాబు.