టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పవన ఫ్యాన్స్కు రోజుకో షాక్ ఇచ్చే విధంగా సినిమా ప్రమోషన్స్ డిజైన్ చేశాడట ఏ.ఎం. రత్నం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసినా.. ఊహించిన రేంజ్లో రెస్పాన్స్ రాలేదు, ఇక పవన అభిమానులు సినిమాపై కంటెంట్ కూడా రిలీజ్ చేయడం లేదంటూ.. మేకర్స్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో.. నిన్న సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.
అదే అసుర సంహారం సాంగ్. ఇది రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నెటింట సంచలనం సృష్టించింది. పవన్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కడమే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా రిలీజ్ అయిన ఈ థర్డ్ సింగిల్కు తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో కలిపి కేవలం 24 గంటల్లోనే ఏకంగా రూ.35 లక్షల వ్యూస్.. 3లక్షల 31 వేల లైక్స్ దక్కాయి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్.. ఇలా అన్ని సోషల్ మీడియా వేదికలపై ఇప్పుడు ఈ పాటే వైరల్ గా మారుతుంది. క్లైమాక్స్లో వచ్చే యుద్ధ సమయంలో.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్గా ఈ సాంగ్ వినిపించనుందట.
నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించడం విశేషం. ఇక ప్రమోషన్స్కి టీంకు అతి తక్కువ సమయం ఉండడంతో.. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రెండుసార్లుగా గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఏ.ఎం రత్నం. ఇక.. ఈ సినిమా సౌత్ ఇండియాతో పాటు.. నార్త్ ఇండియాలోను.. గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా సినిమాపై హైప్ పెంచేందుకు.. ఉత్తరప్రదేశ్, వారణాసిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ గెస్ట్గా పాల్గొననున్నట్లు సమాచారం.