తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్తో దూసుకుపోయిన సీనియర్ నటి మీనాకు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. బాలనట్టిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్లతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ భాషలో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు.. కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మీనా.. పండంటి కూతురికి జన్మనిచ్చింది. తన భర్త, కూతురుతో ఎంతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నక్ర మంలోనే భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో మరణించారు.
సడన్గా భర్త మరణంతో ఎంతగానో కృంగిపోయిన మీనాకు.. సినీ సెలబ్రిటీలు అందరూ అండగా నిలిచి.. ఆమెను తిరిగి మామూలు స్టేజ్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మళ్లీ మెల్లమెల్లగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ పెళ్లయి విడాకులు తీసుకున్న, ఏవో కారణాలతో భాగస్వాములు దూరమై ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్న వారి రెండో పెళ్లి గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా.. మీనా భర్తను కోల్పోయిన క్రమంలో.. ఆమె రెండో పెళ్లి గురించి కూడా పెద్ద ఎత్తున టాక్ వైరల్ గా మారింది. ఇలాంటి క్రమంలోనే మీనా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ను రెండో వివాహం చేసుకోబోతుంది అంటూ టాక్ నడిచింది. హీరో ధనుష్ సైతం తన భార్య ఐశ్వర్య కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వార్తలు మరింత జోరు అందుకున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మీనా వీటిపై రియాక్ట్ అవుతూ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ రూమర్లు అని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటే చెప్పుకొచ్చింది. అయినా ఈ రూమర్లు మాత్రం అగలేదు. ఇక తాజాగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీనా రెండో పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేశాడు. మీనా భర్త సడన్ డెత్ బాధాకరమని చెప్పుకొచ్చిన ఆయన.. మీనా చిన్నప్పటి నుంచి పక్క కమర్షియల్ మనిషని.. మంచి సినిమాలతో టాప్ రేంజ్కు ఎదిగిందని.. ఈమె రెండో పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి.. అయితే త్వరలో ఆమె రెండో పెళ్లి జరిగితే జరగొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గీత కృష్ణ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.