మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ బైరవం. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మరోసారి మనోజ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నారా రోహిత్ నుంచి దాదాపు ఆరేళ్ల క్రితం ప్రతినిధి 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత ఈశ్వర్ మూవీ ఫేమ్ శ్రీదేవితో నటిస్తున్న సుందరకాండ మూవీ ఇప్పటికీ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే నారా రోహిత్ కు కూడా ఇది కమ్ బ్యాక్ మూవీ అని చెప్పాలి. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్కు కూడా ఇది కమ్ బ్యాక్ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ముగ్గురు హీరోలు భైరవంతో స్టరాంగ్ సక్సస్ అందుకోవాలనిప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పాయి. ఇక డైరెక్టర్ విజయ్ కనకమెడలకు ఇది మూడవ సినిమా. మొదట అల్లరి నరుష్తో నాంది, ఉగ్రం సినిమాలను రూపొందించి సక్సెస్ అందుకున్నాడు. కాగా.. భైరవం మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కెరీర్లోను మొదటి బడా బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కోసం ఏకంగా రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఓటీటీ డీల్ ఫైనల్ కాకపోవడంతో.. ఏప్రిల్ లో రిలీజ్ చేయాల్సిన సినిమా.. మే 30కి పోస్ట్పోన్ చేశారు టీం.
ఇక ప్రమోషన్స్లో జోరు పెంచి ఆడియన్స్లో సినిమాపై హైప్ పెంచడంలో కొంతమేర టీం సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ రివ్యూ వైరల్ గా మారుతుంది. తాజాగా మూవీ సెన్సార్ పూర్తయింది. 2 గంటల 35 నిమిషాల రన్ టైం తో తెరకెక్కనున్న ఈ సినిమాకు.. సెన్సార్ A సర్టిఫికెట్ జారీ చేసింది. కాగా ఈ సినిమా విషయంలో.. సెన్సార్ సభ్యులు పాజిటివ్గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. యాక్షన్ సీన్స్, రక్తపాతం ఎక్కువగా ఉండటం వల్ల.. A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. గరుడాన్ మూవీలోని మూల కథను తీసుకొని దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చి.. ఎమోషన్స్ను జోడించి తెరకెక్కించగా.. ఇది వర్కౌట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన వేరే లెవెల్ లో ఉందని సెన్సార్ సభ్యులు వెల్లడించారట. మనోజ్ కి మంచి కం బ్యాక్ అవనుందని చెప్తున్నారు. మనోజ్ నటన అభిమానులను కచ్చితంగా మెప్పిస్తుందట. నారా రోహిత్ తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. శంకర్ కూతురు అదితి శంకర్తో పాటు.. ఆనంది, దివ్య పెళ్లై, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ వారం పెద్దగా సినిమాలు లేకపోవడంతో భైరవంకి కూడా పోటీ ఉండదు. ఇలాంటి నేపథ్యంలో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే భైరవం మూవీ హిట్ కొట్టడం ఖాయం.