తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటీనటులుగా సక్సెస్ సాధించాలని.. హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే.. కొంతమంది మాత్రమే అలాంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మరి కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెనుతిరిగి వెళ్లడం ఇష్టం లేక.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పలు సినిమాల్లో మెరుస్తూ ఉంటారు. అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి సక్సెస్ సాధించడమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ గా ఎన్నో సినిమాల్లో నటించి.. తాజాగా హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఇప్పుడు ఓ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది.
గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు.. తన సొంత మేనేజర్తో ఎఫైర్ నడిపిందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు హనీ రోజ్. ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనే కాదు తమిళ్ లోను నటించి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా సత్తా చాటుకుంది. హీరోయిన్ కావాలని ఆశతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తనలోని టాలెంట్ ఎవరు పెద్దగా గుర్తించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా కాలం కెరీర్ నడిపింది. ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. అయితే.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ మరదలు పాత్రలో హాని రోజ్ మెప్పించింది.
ఈ సినిమా దెబ్బతో ఎన్నో సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. కేవలం తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. కోట్లలో డబ్బు సంపాదించుకుంటుంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లోను సందడి చేస్తుంది. కాగా.. గతంలో హాని రోజ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న సమయంలో.. ఓ మేనేజర్తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకుందట. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఎంతో జాగ్రత్త పడిందట. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన వీళ్ళు వివాహం చేసుకోవాలని భావించారట. కానీ.. తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ మేనేజర్ వేరే అమ్మాయిని వివాహం చేసి పిల్లలను కూడా కన్నాడు. కానీ.. హనీ రోజ్ మాత్రం ఇంకా సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తుంది.