టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బన్నీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బన్నీ. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో తన 22వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే కోలీవుడ్ లో తన సత్తా చాటుకుని తిరుగులేని స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు అట్లీ.
కెరీర్ ప్రారంభంలో రాజా రాణి సినిమాతో హిట్ కొట్టిన ఆయన.. తర్వాత ఆపై తేరి తెలుగులో (పోలీసోడు), మెర్సల్ (అదిరింది), బిగిల్ (విజిల్) లాంటి హిట్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి పాపులారిటి దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్తో బాలీవుడ్ లో జవాన్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక.. ఈ సినిమాతో ఏకంగా 1000కోట్ల కలెక్షన్లు కొలగొట్టి సంచలనం సృష్టింబిన సంగతి తెలిసిందే. ఈ స్ట్రాంగ్ సక్సెస్ తర్వాత అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
అయితే దాదాపు రెండేళ డ్యాప్ తర్వాత అట్లీ తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే అట్లీ ఓ రేర్ రికార్డ్ తన ఖాతాలో వేసుకునున్నాడు. అదేంటంటే ప్రతిష్టాత్మక డాక్టరేట్. ఇది తన శని కెరియర్ లోనే మైలురాయిగా నిలవనుంది. సాంకేతిక నైపుణ్యం, ఆడియన్స్కు కావలసిన కమర్షియల్ అంశాలతో.. క్యాచి కంటెంట్తో.. కథను రూపొందించి ఆడియన్స్ను మెప్పిస్తున్న అట్లీకి.. ఇది సాంకేతిక రంగం నుంచి లభిస్తున్న అరుదైన గౌరవం. జూన్ 14న జరగనున్న ఈ డాక్టరేట్ ప్రధానోత్సవం.. సినీ, విద్య వర్గాలలో ఎంతో ఆసక్తిగా మారింది.