టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆగస్టు 14న బాలీవుడ్ ఫిలిం వార్ 2తో ఆడియన్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమా రూపొందుతుంది. మైత్రి మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఫిలింకు డ్రాగానే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రారంభమైన సినిమా షూట్ లో ఎన్టీఆర్ తో అవసరంలేని కొన్ని సన్నివేశాల షూట్ ను ప్రారంభించేశారు. కొత్త స్కెడ్యూల్లో ఎన్టీఆర్ త్వరలోనే పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.. డ్రాగన్ టీం.
మొదట 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా.. షూటింగ్ కాస్త ఆలస్యం అవడంతో.. సినిమా వేసవికి పోస్ట్ పనైంది. దీంతో సినిమాను ఏప్రిల్ 9, 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట టీం. అంటే.. డ్రాగన్ రిలీజ్ కు సరిగా ఏడాది సమయం ఉంది. ఇదిలా ఉంటే.. డ్రాగన్కు రెండు వారాల ముందే రిలీజ్ కు ఇప్పటికే రెండు సినిమాలు ప్లాన్ చేశారు. మార్చి 26న నాని.. ది పారడైజ్, మార్చ్ 27న చరణ్.. పెద్ది సినిమాలు రానున్న సంగతి తెలిసిందే. ఇక.. పెద్ది నిర్మాణంలో మైత్రి మేకర్స్ కూడా పార్టనర్గా వ్యవహరిస్తుంది. ఇలాంటి క్రమంలో.. మైత్రి మేకర్స్ కొద్దిరోజుల వ్యవధిలోనే రెండు భారీ సినిమాల రిలీజ్ చేయడం అంటే.. పెద్ద రిస్క్ అని చెప్పాలి.
ఈ క్రమంలోనే.. పెద్ది, డ్రాగన్ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంటుంది అనడంలోనూ సందేహం లేదు. ఇక ఈలోపు ఏదైనా సినిమా రిలీజ్ డేట్ మారుతుందో లేదో వేచి చూడాలి. అయితే ఇప్పటికే మైత్రి ఇలాంటి సందర్భాలను ఎన్నో ఎదుర్కొంది. గతంలో బాలయ్య.. వీర సింహారెడ్డి, చిరంజీవి.. వాల్తేరు వీరయ్య సినిమాలను ఒకేసారి రిలీజ్ చేశారు. అలానే ఇప్పుడు మళ్లీ పెద్ది, డ్రాగన్ సినిమాలో విషయంలో జరుగుతుందా.. లేదా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయో వేచి చూడాలి.