నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా తాజాగా రిలీజ్కు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరికొద్ది గంటలో ఆడియన్స్ను పలకరించనున్న ఈ సినిమాతో.. చైతన్య సూపర్ సక్సెస్ అందుకుని స్టార్ హీరో రేంజ్ టచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బాస్టర్ అయితే ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. కాగా ప్రస్తుతం నాగచైతన్యకు ఉన్న మార్కెట్ రిత్యా.. ఈ సినిమాకు బడ్జెట్ చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ.. సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో గీత ఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్తో పాటు బన్నీ భారీగా ఖర్చు చేశారు. ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ అయితే పర్లేదు.
కానీ.. డిజాస్టర్ అయితే మాత్రం ఇకపై చైతుకి అవకాశాలు రావడం కూడా కష్టమే అని టాక్ వినిపిస్తుంది. ఇక ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాతో చైతు భారీ సక్సెస్ సాధిస్తాడని అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రియల్ మత్స్యకారుడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటివరకు అంత బానే ఉన్నా.. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఓ అప్డేట్ వైరల్ గా మారుతుంది. చైతు, సాయి పల్లవి ఇద్దరు క్లైమాక్స్ లో చనిపోతారంటూ వార్త హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ఇది వాస్తవమా.. లేదా సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ఆకతాయిలు క్రియేట్ చేసిన వార్తలో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఆడియన్స్లో మరింత ఆసక్తి నెలకొంది.
హీరో, హీరోయిన్ ఇద్దరు చివరిలో చనిపోతే సినిమా ఎలా ఉంటుందో అనే సందేహాలు జనంలో మొదలయ్యాయి. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో నిజంగానే వీరిద్దరూ చనిపోతారా లేదా తెలియాల్సి ఉంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రేంజ్ లో చైతన్య భారీ సక్సెస్ సాధించే దిశగా రంగం సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఆయన సినీ కెరియర్ లోనే గొప్ప నటనను ఈ సినిమాలో కనబరిచాడట. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై టీం మొత్తం.. ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. చైతు తనని తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి.