మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఈ ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో పాటు సినిమా నుంచి వచ్చిన ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ను చూస్తుంటే సినిమాలో శంకర్ మార్క్ అర్ధమైపోతుంది. ఇక ఈ మూవీలో చరణ్ విభిన్న పాత్రలో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్చరణ్ సినిమాలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఈమిడి ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సినిమాపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు బాలీవుడ్ క్రిటిక్.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు. ఈ క్రమంలో ఉమైర్ ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు నెటింట వైరల్గా మారుతుంది. ఉమైర్.. ఈ సినిమా అసలు బాలేదని తెల్చి చెప్పేసాడు. రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత బలహీనమైన సినిమాగా గేమ్ ఛేంజర్ తెరకెక్కిందని వివరించాడు. నరేషన్ బోరింగ్గా ఉందని.. అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవు అంటూ ఈ బాలీవుడ్ క్రిటిక్ తన ఎక్స్ వేదికగా వివరించాడు. ఇక చరణ్ నటన కూడా ఊహించిన రేంజ్లో లేదని.. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలి అంటూ కోరుకున్నాడు. ఫైనల్ గా సినిమా టార్చర్ అనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
దీనిపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి ట్రిక్స్ చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ.. సినిమా ఎలా ఉంటుందో రిలీజ్కు ముందే చెప్పాల్సిన అవసరం లేదు.. ట్రైలర్ చూస్తేనే ఆయన ఎఫర్ట్ కనిపిస్తుందంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు ముందు ఉమర్ సందుపై చర్యలు తీసుకోవాలని.. సినిమా రిలీజ్ కంటే ముందే రివ్యూ లంటూ సినిమాలపై నెగటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నాడని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్లో కియారా అద్వాని హీరోయిన్గా నటించగా.. అంజలి, సముద్రఖని, ఎస్.జే.సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతానికి ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.