తెలుగు స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన నిర్మాత నాగవంశీ.. ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ నెటింట వైరల్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్న పర్లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ.. అలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో.. అసలు ఏ సందర్భంలో ఆయన కామెంట్స్ చేశాడో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ.. బాలకృష్ణ డాకుమహరాజ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే డాకు మహారాజ్ మూవీ ప్రెస్ మీట్లో ఆయన పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డాకు మహరాజ్ సంక్రాతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్లు వంశి వెల్లడించాడు. ఇక.. సినిమాకు స్టార్ట్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. బాబి చివరిగా వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ గతేడాది సంక్రాంతి బరిలో రిలీజై మంచి సక్సస్ అందుకున్న సంగతి తెలిసిందే.
కాగా బాబి డాకు మహరాజ్ సినిమాని వాల్తేరు వీరయ్య కంటే మరింత బాగా తీశాడంటూ నాగవంశీ ప్రెస్ మీట్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు,. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్న పర్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగవంశీ చిరు, బాలయ్యలతో సినిమాల చేయడం గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి అయితే స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేస్తారని.. బాలకృష్ణ మాత్రం డైరెక్టర్ చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే కామెంట్స్ గతంలో డైరెక్టర్ బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో చేశారు. దీంతో ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.