టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక మహేష్ బాబు నిన్న మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ క్రేజీగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. చివరిగా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ను పలకరించిన మహేష్.. దాదాపు ఏడాది నుంచి రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా మేకవర్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఇప్పటికే చాలామంది రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుండడం చూస్తూనే ఉన్నాం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి తరం సెలబ్రిటీల వరకు ఎంతో మంది రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు.
ఇక.. ప్రస్తుతం పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ రాణిస్తున్నాడు. అలాగే తమిళ్లో విజయ్ దళపతి పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే చాలా కాలంగా మహేష్ బాబు పాలిటిక్స్ లోకి రావాలంటూ ఫాన్స్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు పాలిటిక్స్ ఎంట్రీ ఇస్తాడని చర్చలు వైరల్గా మారాయి. కానీ.. అలాంటి వార్తలపై మహేష్ బాబు ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. తనకు పాలిటిక్స్ అంటే అసలు ఆసక్తి లేదని చెప్తూనే ఉన్నారు. అయినా.. పాలిటిక్స్ వార్తలు మహేష్ బాబుకి ఎదురయ్యే ప్రశ్నలకు మాత్రం చెక్ పడలేదు. చాలామంది సెలబ్రిటీస్.. రాజకీయాల్లోకి వస్తున్నారు.
మీకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా.. అని తాజాగా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా నన్ను ఎవరైనా పాలిటిక్స్ లోకి తీసుకువెళ్తే.. వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైపోతుంది. నాకు రాజకీయాల గురించి కాస్త కూడా నాలెడ్జ్ లేదు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. కథను బట్టి పొలిటికల్ మూవీస్ మాత్రం నటిస్తానని వివరించాడు. మరో మీడియా ప్రతినిధి మాట్లాడుతూ సైనికుడు సినిమాలో కూడా యూత్ కు పాలిటిక్స్ లోకి రావాలని మీరు మెసేజ్ ఇచ్చారు. కనుక.. పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన మీరు చేయడం లేదా అని అడగగా.. అందుకే ఆ సినిమా ఒక వారం మాత్రమే ఆడింది అంటూ తన సినిపై సెటైర్ వేసుకున్నాడు మహేష్. ఈ క్రమంలోనే మహేష్ కు పాలిటిక్స్ పై అసలు ఇంట్రెస్ట్ లేదని.. అసలు ఎంట్రీ ఇవ్వాలని ఆలోచన లేదని క్లారిటీ వచ్చేసింది.