టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళిన క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే యువతి మరణించింది. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యులో అల్లు అర్జున్ను 13-12-2024 న అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా.. అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన అరెస్టును ఖండిస్తూ అల్లు అర్జున్కు సపోర్ట్గా కామెంట్స్ చేశారు.
అయితే కొద్దిసేపటి క్రితం.. అల్లు అర్జున్ మద్యస్థ బెయిల్తో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. మల్లన మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్ ఒక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పనలేదా..? జానీ మాస్టర్ జైలుకు వెళ్లడానికి అల్లు అర్జున్ కుట్ర ఉందా.. లేదా..? ఆయనకు బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్ళేనా కాదా..?
మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయిగా ఉన్నాడుగా. నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా అంటూ మల్లన్న ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి. కొందరు మల్లన్న మాటలకు సపోర్ట్ గా నిలుస్తుంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ రేప్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ తీసుకుని రాలేదు.. ఆయన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది అంటూ.. మా హీరోపై ఇలా లేనివి ప్రచారం చేస్తే అసలు సహించేది లేదంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.