నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఏదైనా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి అమరాన్ సినిమాలో నటిస్తుంది. శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. అమరాన్ సినిమాలో నటించడం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
నాకు ముందు అమరాన్ మూవీ స్క్రిప్ట్ వచ్చింది.. స్క్రిప్ చదివిన తర్వాత ఎన్నో సందేహాలు అంటూ చెప్పుకొచ్చింది. కమర్షియల్ సినిమాల్లో పెద్ద హీరోలతో కలిసి పనిచేసే టైం లో చాలా కంటెంట్ ఉంటుంది.. అందువల్ల స్క్రిప్ట్ లో కొన్ని సన్నివేశాలు తీసి.. మిగతావి కట్ చేస్తారని భావించానంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. డైరెక్టర్ కి కూడా నేను ఇదే విషయాన్ని చెప్పానని.. దర్శకుడు నరేషన్ ఇచ్చిన తర్వాత సినిమాలోని పాత్రను వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎంతో లక్కు ఉంటే కానీ ఇలాంటి పాత్రల్లో అవకాశాలు రావటం కష్టం అంటూ సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అమరాన్ సినిమాలో బలమైన పాత్ర ఉండటం వల్లే తను ఆ సినిమాకు ఓకే చెప్పినట్లు సాయి పల్లవి కామెంట్స్ తో అర్థమవుతుంది. ఇక సాయి పల్లవి మొదటి నుంచి మాస్ మసాలా సినిమాలకు దూరంగా.. పాత్రలో ప్రాధాన్యత ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమరాన్ మూవీ మేజర్ ముకుందా వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. అశోక్ చక్ర అవార్డ్ గ్రహిత మేజర్ ముకుంద వరదరాజన్ భార్య రెబ్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించనున్నారు. తన సినీ కెరీర్లోనే బెస్ట్ రోల్స్లో ఈ పాత్ర ఒకటి అంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో అభిమానుల్లో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.