వెండితెర అద్భుత దృశ్య కావ్యం మాయాబజార్ గురించి ఇప్పటికీ ఎంతోమంది ప్రస్తావిస్తూనే ఉంటారు. 66 ఏళ్ల క్రితం వెండితెరపై రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సాంకేతికత గురించి ఇప్పటికీ ఎందరిలోనో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కెమెరామెన్ మార్కస్ భర్ట్.లీ అప్పట్లో గ్రాఫిక్స్ సృష్టించే అంత టెక్నాలజీ లేకపోవడంతో.. కెమెరా టెక్నిక్స్ తో మాయాజాలాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. నిజంగా మాయలు జరుగుతున్నట్లుగా ఆడియన్స్ భావించారు. ముఖ్యంగా వివాహ భోజనంబు సాంగ్లో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం.. పాత్రలు కదలడం లాంటి సీన్లు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పటికి సినిమాలోని వివాహ భోజనంబు సాంగ్ ఎంతోమంది విని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటిసారిగా లాంగ్ లెన్త్ శ్రీకృష్ణుడిగా కనిపించే మెప్పించాడు. అంతకుముందు 1954 లో వచ్చిన ఇద్దరు పెళ్ళాలు.. 1956 సినిమాల్లో కృష్ణుడిగా నటించిన సొంత ఊరు.. కృష్ణుడి పాత్రలు అయినా పాత్ర నడివి చాలా తక్కువ. మాయాబజార్ టైంలో ఎన్టీఆర్, ఏఎన్నార్లు మార్కెట్ కన్నా ఎస్వి రంగారావు గారు మరింత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. జనాల్లో పాపులారిటీ ఎక్కువగా ఉండేది. అందుకే రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని ఎస్.వి.ఆర్ పేరు మీద చేశారు. దాదాపు 2లక్షల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు.
అప్పట్లో తెలుగులో వచ్చిన ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయినా.. 30వేలు మించి ఉండేది కాదు. నిర్మతలు కూడా.. దానికి మించి సాహసించేవారు కాదు. కానీ.. మాయాబజార్ విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును తీసుకున్న విజయ ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు రూపొందించారు. ఇందులో భాగంగానే తెలుగు, తమిళ్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాని హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి.. ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. రిలీజ్ అయిన అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతే కాదు ఈ సినిమా అప్పట్లో నే ఎన్నో కళ్ళుచెదిరే రికార్డ్లను ఖాతాలో వేసుకుంది. అందుకే టాలీవుడ్ ఆడియన్స్కు మాయాబజార్ అప్పటికి, ఇప్పటికీ ఎప్పటికైనా ఒక గోల్డెన్ మెమరీగా నిలిచిపోతుంది.