టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో సంఘవి కూడా ఒకటి. కొక్కొరొకో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ను ప్రారంభించిన సంఘవి.. ఈ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ మొదటి సినిమానే అజిత్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అజిత్ కు కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత దళపతి విజయ్తో ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్.
ఈ క్రమంలో వరుస హిట్లు అందుకుని తమిళ్లో మంచి మార్క్ను క్రియేట్ చేసుకున్న సంఘవి.. తర్వాత కన్నడం, మలయాళంలోను నటించి అక్కడ సక్సెస్ అందుకుంది. తర్వాత రెండేళ్లకు శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్మహల్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని మెప్పించింది. ఈ సినిమాతో అమ్మడుకి మంచి క్రేజ్ ఏర్పడింది. తర్వాత తెలుగులో నాయుడు గారి కుటుంబం, సరదా బుల్లోడు, ప్రియమైన శ్రీవారు, ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. రవితేజ – కృష్ణవంశీ కాంబినేషన్లో వయ్యిన సింధూర అమ్మడికి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్గా నిలవడంతో సంఘవికి మంచి క్రేజ్ ఏర్పడింది.
తర్వాత వెంకటేష్ సూర్యవంశం సినిమాలో మాధవిగా, శివయ్యలో… శిరీషగా, ఆహాలో.. జానకిగా కీరోల్స్లో నటించి ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక టాలీవుడ్ లో చివరిగా ఒక్కడే కానీ ఇద్దరు సినిమాలో మెరిసిన సంఘవి.. తర్వాత వెంకటేష్ అనే బిజినెస్ మాన్ను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. 15 సంవత్సరాల కెరీర్లో 80కు పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో 38 సినిమాలు నటించే ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అమ్మడి లేటెస్ట్ పిక్స్ నెటింట వైరల్గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అమ్మో సంగవి ఏంటి ఇంతలా చబ్బీ అయిపోయింది అంటూ.. ఏంటి తను హీరోయిన్ సంఘవినా అస్సలు గుర్తుపట్ట లేకుండా ఉన్నామే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.