సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా అడుగుపెట్టి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే ఎన్నో సినిమాలో నటిస్తూ సక్సస్ అందుకున్న మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబు కేవలం సోలో సినిమాలకే కాదు.. మల్టీ స్టారర్ సినిమాలపై కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక తర్వాత బాలయ్య బాబుతో కూడా మహేష్ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి ఉండేది. కానీ.. అది ఆగిపోయింది. ఇంతకీ ఆ కథ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. గతంలో తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో మహేష్ బాబు, బాలయ్య ఓ సినిమాను అనుకున్నారట. ఇద్దరు దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ.. ఏవో అనుకోని కారణాలతో ఈ సినిమా వర్కౌట్ కాలేదట. దీంతో సినిమా సెట్స్ పైకి రాకముందే చెక్ పడిపోయింది.
అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి బాలకృష్ణ, మహేష్ బాబుల కాంబో కథ గురించి విన్నాను అని ఆ సినిమాకి తానే వర్క్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ వీరి కాంబో మూవీ కోసం ఎదురుచూస్తేన్నారు. అయితే ఇప్పటివరకు వీరి కాంబో మూవీ పై ఏ వార్త వినిపించలేదు. ఇక నందమూరి నటసింహ బాలయ్య హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఫ్యూచర్లో ఆయన ఓ మల్టీస్టారర్ లో కలిసి నటిస్తారేమో వేచి చూడాలి.