సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మేకోవర్లో బిజీగా గడుపుతున్నాడు మహేష్. ఇక ఈ సినిమా సెట్స్పైకైనా రాకముందే ఆల్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన్న ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. అందులో భాగంగానే మహేష్ సినిమా కథ కూడా వినకుండానే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. 15 రోజుల తర్వాత కథ విన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. కథ కూడా వినకుండా సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
సాధారణంగా ఒక కథ రాయడం పూర్తైన వెంటనే.. డైరెక్టర్ స్టోరీ పట్టుకుని హీరో దగ్గరికి వెళ్లి నరేట్ చేస్తారు. కథ నచ్చితే హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. నచ్చకపోతే సజెషన్స్ ఇచ్చే మార్పులతో మళ్ళి రాసుకురమ్మని చెబుతారు. అలాగే మహేష్ బాబు కూడా చేస్తారు. కానీ.. ఆయన కథ వినకుండా డైరెక్టర్ పై నమ్మకంతో క్యారెక్టరైజేషన్ మాత్రమే విని.. షూటింగ్ ప్రారంభమైన తర్వాత పూర్తి కథను విన్నరట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఓ సందర్భంలో వెల్లడించారు. పూరి జగన్నాథ్పై ఆయనకు విపరీతమైన నమ్మకం అని.. అందుకే సినిమా కాదు ఏంటని అడగాల్సిన అవసరం రాలేదంటూ చెప్పుకోచ్చాడు. కేవలం క్యారెక్టర్ విని కనెక్ట్ అయ్యారని సినిమా మొదలెట్టేసామంటే చెప్పుకొచ్చాడు.
15 రోజుల షూటింగ్ తర్వాత పూరి జగన్నాథ్ పట్టుబట్టి కథ చెప్పారని వెల్లడించాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు ఇద్దరు బిజినెస్ మాన్. సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాల్లో సూర్య క్యారెక్టర్ లో కనిపిస్తాడు. మహేష్ – కాజల్ పై తీసిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దూకుడు తర్వాత థమన్ ఈ సినిమాకు అందించిన సంగీతం మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా మ్యూజికల్గాను హిట్ అయింది. ఇక సినిమాలోని మహేష్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. ఆడియన్స్ సినిమాకు క్యూ కట్టారు. ఇక ఓ సందర్భంలో ఈ సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను కేవలం షూటింగ్ ప్రారంభమైన 15 రోజులు తర్వాత స్టోరీ విన్నా. జగన్ గారు కేవలం పదినిమిషాలు చెప్పారు. నా క్యారెక్టర్ టెర్రిఫిక్ గా ఉంటుందని అర్థమైంది. వెంటనే ఓకే చెప్పేసంటూ బిజినెస్మాన్ కథ గురించి చెప్పుకొచ్చాడు మహేష్.