సొట్టబుగ్గల సుందరి తాప్సి బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను ఈ సంవత్సరం రహస్యంగా పెళ్లాడింది. అయితే ఈ విషయం తన సన్నిహితులు, ఫ్రెండ్స్ బయట పెట్టేదాకా తాప్సి స్పందించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు తాప్సి పెళ్లి వీడియో వైరల్ అయింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీకి వెళ్ళిన తాప్సి సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన సమయంలో ఓ డైరెక్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుందట.
ఇక ఆ డైరెక్టర్ కొడుకు ఎవరో కాదు ఆది పినిశెట్టి.. తెలుగులో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి రాజా పినిశెట్టి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన నటించిన సినిమాలేవి అంతగా పేరు తెచ్చుకోకపోయేసరికి కనీసం కొడుకుని విలన్, స్పెషల్ పాత్రల్లోనైనా సెట్ చేయాలి అనుకున్నారు. అలా టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు విలన్ గా కీలకపాత్రల్లో అవకాశాలు వచ్చేలా రవి రాజా పినిశెట్టి తన కొడుకు భవిష్యత్తు కోసం తెలుగులో రేసుగుర్రం, ది వారియర్ సినిమాల్లో విలన్ అవకాశాలు వచ్చేలా చేశారు. అలాగే నిన్ను కోరి, రంగస్థలం, యూ టర్న్ వంటి సినిమాల్లో కీలకపాత్రల్లో నటించారు.
అయితే అలాంటి ఆది పినిశెట్టితో తాప్సి గుండెల్లో గోదారి అనే సినిమాలో నటించింది.అయితే ఈ సినిమాలో నటించిన సమయంలో తాప్సి, ఆది పినిశెట్టి కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట.ఈ బాండింగ్ ని పెళ్లి వరకు తీసుకువెళ్లాలి అనుకున్నప్పటికీ అది మధ్యలోనే బ్రేక్ అయింది. అయితే వీరి బ్రేకప్ కి కారణం రవి రాజా పినిశెట్టి అని అప్పట్లో ఓ టాక్ వినిపించింది.అయితే తన కొడుకు అప్పుడప్పుడే హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కాబట్టి ఇలాంటి టైమ్ లో ప్రేమ, డేటింగ్ వంటి వార్తలు వినిపిస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో రవి రాజా పినిశెట్టి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినట్టు టాక్. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందని అప్పట్లో టాలీవుడ్ లోని కొంతమంది గుసగుసలు పెట్టుకున్నారు.