ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పై ఫోటోలో అమ్మతో కలిసి అందంగా ఫోజులిస్తున్న స్టార్ బ్యూటీ ఫోటో నెటింట వైరల్ గా మారింది. ఈ అఅమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలో నటించి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
తమిళ్లో విజయ్ దళపతి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు.. హిందీలోను సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్లో హీరోయిన్గా రాణించింది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటు టాప్ పోజిషన్లో ఉన్న ఈ అమ్మడికి ప్రస్తుతం దురదృష్టం వెంటాడుతుంది. ఏ భాషలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసిన అవన్నీ ఫ్లాప్ గానే మారడంతో అమ్మడు డీల పడిపోయింది. గత కొద్ది కాలంగా ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోయినా.. తాజాగా ఈ అమ్మడి చేతికి రెండు క్రేజీ ప్రాజెక్టులు వచ్చి పడ్డాయి. అవి కూడా స్టార్ హీరోలు సినిమాలు కావడం విశేషం. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి హిట్ గా నిలిచినా.. మళ్లీ ఈ అమ్మడు కం బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అన్నా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంత చెప్పాము కదా.. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఎస్ మీ గెస్ కరెక్టే. ఆమె మరెవరో కాదు మన టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే. ప్రస్తుతం పూజా హెగ్డే తన తల్లితో కలిసి క్యూట్ గా ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ పిక్ తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈ పిక్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక పూజ టాలీవుడ్ లో కనిపించే దాదాపు మూడేళ్లు అయింది. చివరిసారిగా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు సినిమా ఫ్లాప్ కావడంతో హీరోయిన్గా నటించలేదు. అయితే వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ ఎఫ్3 సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కిసికా బాయ్ కిసిక జాన్ సినిమాతో చివరిగా కనిపించింది.