ఈ ముగ్గురు బుల్లోళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన బుల్లోడు ఎవరంటే..?

సినీ స్టార్ హీరోస్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు స్టార్ హీరోల నుంచి బంగారు బుల్లోడు, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు బుల్లోళ్ళ‌లో ఎవరు భారీ సక్సెస్ అందుకున్నారో.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు బ్లాక్ బ‌స్టర్ అందుకని ప్రేక్షకులను మెప్పించారో ఒకసారి చూద్దాం. మొదట 1990వ దశంలో ముగ్గురు స్టార్ హీరోస్ తమ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు.

Bangaru Bullodu 1994 Movie (1994): Release Date, Cast, Ott, Review,  Trailer, Story, Box Office Collection – Filmibeat

1990 నందమూరి నట‌సింహం బాలయ్య‌, బి.గోపాల్ కాంబోలో లారీ డ్రైవర్ సినిమా సక్సెస్‌తో ప్రారంభమైంది. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు సినిమాలతో మరోసారి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య. 1993 జగతి పిక్చర్స్, రవిబాబు పిన్నిశెట్టి డైరెక్షన్‌లో బంగారు బుల్లోడు సినిమా రిలీజ్ కాగా.. ఈ సినిమాల్లో బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక రవినా టాండ‌న్‌ను టాలీవుడ్కు పరిచయం చేసిన సినిమా ఇదే కావడం విశేషం. 1993లో ఇదే రోజున బాలయ్య నిప్పురవ్వ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలలో నిప్పురవ్వ బోల్తా కొట్టి.. బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఘరానా బుల్లోడు (1995) | ఘరానా బుల్లోడు Movie | ఘరానా బుల్లోడు Telugu Movie  Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat

కిల్లర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు ఇలా హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న నాగార్జున.. ఈ మూడు సినిమాల తర్వాత ఘరానా బుల్లోడు మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. 1995 ఆర్కే ఫిలిం అసోసియేషన్.. కే రాఘవేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో.. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించారు. కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు మరింత హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని నాగార్జునకు మరో హిట్ అందించింది.

Watch Sarada Bullodu (Telugu) Full Movie Online | Sun NXT

1990లో బొబ్బిలి రాజా సినిమా బ్లాక్ బ‌స్టర్‌తో వెంకటేష్ తన ఏడాదిని ప్రారంభించాడు. తర్వాత చంటి, కొండపల్లి రాజా లాంటి సక్సెస్ఫుల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో సరదా బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటేష్ 1996 విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్.. రవిరాజా పిన్నిశెట్టి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ మూవీలో వెంకటేష్, నగ్మా జంటగా నటించగా.. అత్త – అల్లుళ్ల సవాల్‌తో కూడిన కథతో సినిమా రిలీజ్ అయింది. అలనాటి స్టార్ బ్యూటీ మంజుల ఈ సినిమాలో అత్తగా నటించి మెప్పించింది. రాజ్‌కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అలా వరుస హిట్లతో మంచి జోరులో ఉన్న ఈ ముగ్గురు బుల్లోళ్ళ‌లో బాలయ్య, నాగార్జున ప్రేక్షకులను మెప్పించారు. వెంకటేష్ సినిమా మాత్రం డీలా పడింది.