టాలీవుడ్ సూపర్ స్టార్గా భారీ పాపులారిటి దక్కించుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు జక్కన్న. కాగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ అడవిల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో సలార్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
ఇక అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అభిమానులతో షేర్ చేసుకుంటారా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సినిమా ప్రారంభానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. రాజమౌళి స్క్రిప్ లాకై, కాస్టింగ్ ఫైనల్ అయిన తర్వాత దీనిపై అఫీషియల్ ప్రకటన వెల్లడించనున్నాడని.. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ త్వరలోనే.. మహేష్ పుట్టినరోజు నేపథ్యంలో ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే అదే రోజున ఈ అనౌన్స్మెంట్ వచ్చిందంటే.. మహేష్ ఫ్యాన్స్ కు ఇంతకన్నా బిగ్ ట్రీట్ ఉండదు అనడంలో సందేహం లేదు. అంతేకాదు మహేష్ పుట్టినరోజు నాడే మరో ట్రీట్ కూడా ఉండబోతుందట.
ఆయన నటించినా మొట్టమొదటి హిట్ మూవీ మళ్లీ రిలీజ్ అవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన మురారి సినిమాతోనే మొదటి హిట్ అందిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. అలనాటి రామచంద్రుడు అన్నింట సాటి సాంగ్.. ఇప్పటికీ ఎంతోమంది టీవీలలో మోగుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారని ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో.. ఆ రోజున 4k వర్షన్లో సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారని వార్తలో వినిపిస్తున్నాయి. ఓవైపు రాజమౌళి సినిమా ప్రకటన.. మరోవైపు మురారి రిలీజ్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆ రోజున డబల్ ధమాకా ఉండబోతుందట.