ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. అయితే ప్రభాస్కు మొట్టమొదటి బ్రేక్ ఇవేన్ ఇచ్చిన సినిమా మాత్రం వర్షం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్లను కొల్లగొట్టి ఫిలం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రభాస్ను నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఛత్రపతితో.. ప్రభాస్ మరోసారి బ్లాస్టింగ్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత చేసిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు కూడా వరుసగా హిట్స్ అవడంతో రెబల్ స్టార్గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక పూరి జగన్నా డైరెక్షన్లో వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలతో యూత్కు మరింతగా కనెక్ట్ అయ్యాడు ప్రభాస్.
ఇక రాజమౌళి డైరెక్షన్లో తను నటించిన రెండో సినిమా బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసాయి. రాజమౌళికి పాన్ ఇండియా రేంజ్ లో లక్షలాదిమంది ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇక ప్రభాస్ నటించిన సలార్, కల్కి రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించి రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ప్రభాస్కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్గా మారింది. ఇక జక్కన్న, ప్రభాస్ మధ్యన ఉన్న బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మొదటి సినిమా ఛత్రపతి. ఈ సినిమా షూట్ టైంలో ప్రభాస్ చుట్టూ చాలామంది ఉండడంతో.. నేను ఇంతమంది ఉండగా డైలాగ్ గట్టిగా చెప్పలేను. స్లోగా చెప్తాను అంటూ ప్రభాస్ డైలాగులు చాలా స్లోగా వినిపించాడట. అయితే అలా స్లోగా చెప్పిన కూడా రాజమౌళి దానిని ఓకే చేసేసాడట. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగిందట. కే. విశ్వనాథ్తో జరిగే సన్నివేశాల్లో ఆయనతో స్లోగా డైలాగ్లు చెప్పానని.. షార్ట్ ఐపోయిన తర్వాత ఆయన నన్ను దగ్గరకు పిలిచి మరీ సీరియస్ అయ్యారని.. ఇన్ని సినిమాల్లో నటించావు ఇప్పటికీ స్లోగా డైలాగ్స్ చెబితే ఎలా.. ఇక్కడ వరకు వచ్చావు.. ఇంకా భయం ఎందుకు అంటూ తిట్టారని స్వయంగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.