టాలీవుడ్ లో పలు సినిమాలు ఎవర్గ్రీన్ హిట్లుగా నిలిచిపోతూ ఉంటాయి. ఏళ్లు గడిచినా కూడా ఆ సినిమాలు బుల్లితెరపై వస్తున్నాయంటే టీవీలకు అతుక్కుపోతుంటారు అభిమానులు. ఎంత చూసినా అలా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, ప్రకాష్ రాజ్, ఎమ్ఎస్ నారాయణ కీలకపాత్రలో మెప్పించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసింది. దాదాపు ఈ మూవీ వచ్చి 24 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ మూవీ వస్తుందంటే చాలామంది టీవీలకు అతుక్కుపోతారు.
అంతలా ఆదరించి ఆకట్టుకున్న ఈ సినిమాలో కేవలం ఒక్క ఐదు నిమిషాల సీన్ కు ఏకంగా ఐదు నెలల టైం పట్టిందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్ విజయభాస్కర్ వివరించాడు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అమ్మ గురించి గుర్తు చేసుకుంటూ లెటర్ చదివే సీన్ ఉంటుందని.. అప్పుడు దాదాపు సీన్ లో మెయిన్ పాత్రలు అన్నీ ఉంటాయి.. దీంతో అందరూ యాక్టర్స్ ను ఒకేసారి తీసుకురావడం చాలా కష్టమైంది అంటూ వివరించాడు. ఆ సీన్ షూట్ చేసే టైంలో ఆర్తి అగర్వాల్ మరో సినిమా కోసం యుఎస్ కు వెళ్లారని.. అలాగే వెంకటేష్ వేరే షూట్లో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
ఇలా సునీల్, ప్రకాష్ రాజ్ వీళ్లంతా కూడా బిజీగా ఉండడంతో.. అందుబాటులో ఉన్న ఒక్కొక్క యాక్టర్తో ఒక్కొక్కసారి ఇండివిడ్యువల్గా సీన్ తీసి అందరినీ సన్నివేశంలో రీ క్రియేట్ చేసి ఈ సీను చూపించాము.. అలా మొత్తం సీన్ పూర్తయ్యేసరికి ఐదు నెలల వరకు టైం పట్టింది అంటూ వివరించాడు డైరెక్టర్ విజయభాస్కర్. అయితే ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఫుల్గా ఎంజాయ్ చేశ్తారు. ఎంతో కామెడీగా తెరకెక్కిన ఈ సీన్ ఇప్పటికీ ప్రేక్షకల్లో గుర్తుండిపోయింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. రాజమౌళిని మించిపోయి మరి దర్శకుడు పర్ఫెక్ట్ గా సన్నివేశాన్ని చిత్రీకరించాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.