ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడ విన్నా కల్కి వార్తలే వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు అలాంటివి మరీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. మొదటి రోజే దాదాపు రూ.200 కోట్లు వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.700 భారీ బడ్జెట్లో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించడానికి ముఖ్య కారణం ప్రియాంక దత్త్, స్వప్న దత్త్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వీరిద్దరూ అశ్విని దత్త్ కుమార్తెలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే సినిమాకు దర్శకుడు రెండవ కుమార్తె ప్రియాంక దత్ భర్త నాగ్ అశ్విన్. మొత్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి కుటుంబం తర్వాత అతిపెద్ద సినీ కుటుంబంగా.. వైజయంతి మూవీస్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక సినిమాల విషయంలో చాలా సక్సెస్ గా దూసుకుపోతున్న వీరు మంచి సినిమాలను తీస్తూ ఫ్యాషన్ ఉన్న నిర్మాతలుగా క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక్కడి వరకు సరే కానీ.. ఈ అమ్మాయిలు ఇద్దరు వ్యక్తిగతంగా తండ్రిని చాలా బాధపెట్టారని.. మొదటి నుంచి అశ్విని దత్కు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుందని.. కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడిని టాక్.
అశ్వినీ దత్త్ టీడీపీ పార్టీ కోసం ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరి ఇంత కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్విని దత్త్కు ఇద్దరు అల్లుళ్ళు కూడా బయట సామాజిక వర్గానికి చెందినవారు దొరకడం గమనార్హం. పైగా తమ ఇద్దరు కుమార్తెలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వీరు పెళ్లిళ్ల విషయంలో నడుచుకున్నారు. అశ్వినీ దత్త్ మొదటి కుమార్తె స్వప్న దత్త్, ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని 2010లో ప్రేమించి వివాహం చేసుకుంది. మొదటి అశ్విని దత్త్కు వీరి ప్రేమ అసలు ఇష్టం లేదట. అయితే శక్తి సినిమా టైంలో స్వప్న తన ప్రేమను జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకోగా.. ఆయన దగ్గరుండి అశ్విని దత్త్ను ఒప్పించి వీరి పెళ్లి జరిపించారని తెలుస్తోంది.
ఇక ప్రియాంక దత్త్ కూడా తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా.. ఆమె ప్రేమించిన వాడిని అంటే నాగ్ అశ్విన్ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కలిగి సినిమా దర్శకత్వం వహించిన నాగ అశ్విని ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇక వీరిద్దరి పెళ్ళికి కూడా మొదటి అశ్వినీ దత్త్ నిరాకరించిన తర్వాత కూతుర్లు ఇద్దరు కలిసి ఆయనను ఒపించి వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం కొడుకు కూడా జన్మించాడు. స్వప్నకి నవ్య అనే ఒక కూతురు ఉంది. ఇలా ఎంతో కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్విని దత్ ఇద్దరి కూతుళ్ళ విషయంలో కూడా మొదట నిరాకరించిన తర్వాత వారి పెళ్లి విషయంలో ఒప్పుకోవాల్సి వచ్చింది.