ప్రతి ఒక్క ఆడపిల్లకి పీరియడ్స్ ప్రాబ్లం కామన్ ..ఆ పీరియడ్ ప్రాబ్లం భరించాల్సిందే ..అది ఎలాంటి అమ్మాయి అయినా సరే ..అయితే చాలామంది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో పీరియడ్ టైం లో ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవడం ..చైనీస్ ఫుడ్ తీసుకోవడం.. స్పైసీగా నూడిల్స్ లాంటివి తీసుకోవడం వంటివి చేస్తున్నారట. అయితే తాజాగా డాక్టర్లు అది పెద్ద తప్పు అంటూ హెచ్చరిస్తున్నారు . అమ్మాయిలు పీరియడ్స్ టైం లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలట .
మరి ముఖ్యంగా కారంగా మసాలా ఫుడ్ కడుపు మంట తెప్పించే ఫుడ్ అసలు తినకూడదట. పచ్చిమిర్చి కూడా అసలు తిననే తినకూడదట . చాలా కూల్ గా డైజెస్ట్ అయిపోయేవి సాఫ్ట్ గా ఉండే ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తినాలి అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు పీరియడ్ టైమ్స్ లో వ్యాయామం లాంటివి కూడా చేయకూడదట . మరీ ముఖ్యంగా పీరియడ్స్ టైమ్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది.

ఆ కారణంగా రకరకాల ఫీలింగ్స్ కూడా కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో అమ్మాయిలకి పక్క వ్యక్తి సపోర్ట్ చాలా చాలా అవసరం. మరీ ముఖ్యంగా హెవీ బ్లీడింగ్ అవుతున్న అమ్మాయిలు అయితే నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకపోవడమే మంచిదట . పెళ్లికాని అమ్మాయిలకు ఇది మరీ మరీ ముఖ్యమంటున్నారు డాక్టర్లు. అందుచేతనే అమ్మాయిలు పీరియడ్స్ టైం లో మాంసాహారం కారం మసాలా ఫుడ్స్ తీసుకోకపోవడం బెటర్ అంటున్నారు డాక్టర్లు..!!