ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరో హీరోయిన్లు కలిసి సినిమాలో నటిస్తే వచ్చే కిక్కే వేరు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న పాఠాలు కూడా అదే . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో హీరో వరుణ్ తేజ్ ..హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
ధనుష్ కుబేర సినిమా షూట్ అయిపోగానే ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ రాబోతుందట. ఈ సినిమాను క్రిష్ నిర్మించబోతున్నాడు అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని చూస్ చేసుకున్నారట శేఖర్ కమ్ముల. మనకు తెలిసిందే శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత ఫీల్ గుడ్ గా ఉంటాయో .
ఇక భార్యాభర్తలను పెట్టి ఆ సినిమా తెరకెక్కిస్తే కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. కచ్చితంగా ఈ సినిమా ఫిదా కి మించిన రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ఆశపడుతున్నారు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..? కాగా ప్రసెంట్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు.