టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి.. చిన్న వయస్సులోనే ఉప్పెన సినిమాలో బేబమ్మగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. మొదట సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నాని సినిమాలో గ్లామర్ షో తో పాటు లిప్ లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది.

ఇక ఆ తర్వాత నాగార్జున, నాగచైతన్య నటించిన బంగారు రాజు సినిమాలో మెరిసింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత కృత్తి నటించిన సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్స్ అవడంతో ఆమెకు మెల్లగా అవకాశాలు తగ్గాయి. యంగ్ హీరోలు అందరి సరసన నటించిన కృతి చివరిగా అక్కినేని హీరో నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. తర్వాత తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా కూడా సట్స్పైకి రాలేదు. దీంతో ఆమె పై ఐరన్ లెగ్ అంటూ ముద్ర పడిపోయింది.
ఇలాంటి టైం లో కృతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. తమిళ్ లో జీని అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జయం రవి హీరోగా నటిస్తున్నాడు. కాగా కృతి శెట్టితో పాటు.. కళ్యాణి ప్రియదర్శన్, వామిక కబి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారట. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి గణేష్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం కృతి శెట్టి ఫేట్ మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.