మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్తేజ్ నటించిన తాజా మూవీ విరుపక్ష. సంముక్తమీన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే ఐదు వారలు పూర్తి చేసుని ఎంతో విజయవంతగా థియేటర్లు లో రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే రూ.40 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా విరూపాక్ష నిలిచింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలు వచ్చినా అవి ఫ్లాప్ కావడం విరూపాక్షకు అడ్వాంటేజ్ గా మారింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది.
ఈ సినిమాను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ సొంతం చేసుకున్నా విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రీలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేసుకుంది. మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యాక తీసిన మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకుంది. ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది.